ఆదివాసీ కాలనీగా పేరు మార్చాలని గ్రామసభలో ఆదివాసీల వినతిపత్రం .. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలోని చింతకుంట ఆదివాసీలు తమ కాలనీ పేరును "ఆదివాసీ కాలనీ"గా మార్చాలని కోరుతూ గ్రామసభలో వినతిపత్రం సమర్పించారు. గ్రామ సర్పంచ్ మచ్చ నరసింహారావు, గ్రామ పెద్దలు, పాలకవర్గ సభ్యులు, ఎంపీడీవో ముత్యాలరావుకు ఆదివాసీలు ఈ వినతిపత్రాన్ని అందజేశారు.వినతిపత్రంలో వారు పేర్కొంటూ, గత పాలనలో తమ కాలనీకి తమ అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా "రేగ కాలనీ"గా నామకరణం చేసి బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ సమయంలో తమను గానీ, తమ అభిప్రాయాలను గానీ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఆదివాసీలందరికీ బాధ కలిగించిందని గ్రామసభ సభాముఖంగా వెల్లడించారు.చింతకుంట ఆదివాసీల అభిప్రాయం మేరకు తమ కాలనీకి ఏ నాయకుడి పేరు గానీ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు గానీ లేకుండా, తమ ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబించే విధంగా "ఆదివాసీ కాలనీ"గా నామకరణం చేయాలని కోరారు. గ్రామ ప్రజల సాక్షిగా గ్రామసభలో తీర్మానం చేసి, ప్రస్తుతం ఉన్న బోర్డు పేరును తొలగించి తక్షణమే "ఆదివాసీ కాలనీ"గా మార్చాలని సవినయంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాడిద మహేష్, ఆవుల రవి, బేతం రామకృష్ణ, తూము రాఘవులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
By -
జూన్ 06, 2026
Read Now