మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సేవా పురస్కారం.

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0
*

మణుగూరు, ఆగస్టు 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తహసీల్దార్‌గా అద్దంకి నరేష్ అందిస్తున్న అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పురస్కార పత్రం అందుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భద్రాచలం ఐఏఎస్ సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట చేతుల మీదుగా అద్దంకి నరేష్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభుత్వ అధికారిగా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవకు ఈ పురస్కారం నిదర్శనంగా నిలిచింది.

ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం, నిబద్ధతతో పనిచేస్తూ ‘సర్వీస్ ఎక్సలెన్స్’ సాధించినందుకు ఈ గౌరవం లభించింది.

ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అద్దంకి నరేష్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో మరింత అంకితభావంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default