అశ్వాపురం ఎస్సీ కాలనీలో భారీ చోరి.

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0
 ఐదు తులాల బంగారం, నగదు అపహరణ*.. 

అశ్వాపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. కాలనీకి చెందిన నలగుట్ల వెంకన్న కుటుంబ సభ్యులు ఖమ్మంలోని బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వెళ్లి సోమవారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని బీరువాలను గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి అందులో భద్రపరిచిన సుమారు ఐదు తులాల బంగారం, రూ.65 వేల నగదును అపహరించినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default