బిఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0



జూలై 02.
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండలం, వెంకటాపురం గ్రామపంచాయతీ లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సోయం శ్రీను అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడ రేగాకాంతారావు శ్రీనివాస్ స్వగృహానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి, పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని, ఏ కష్టం ఎదురైనా నేరుగా నన్ను సంప్రదించాలని, పిల్లల చదువుల విషయంలో తాను దోహద పడతానని కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి, మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, బొర్రా శ్రీను బాబు, పొడి మన్మథ రెడ్డి, యంగలి భిక్షంరెడ్డి, కళ్లం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default