ఏఎల్ఎం సుబ్బారావుకు సర్పంచ్ భూరెడ్డి స్వాతి ఘన సన్మానం.

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0
నవశకం. జూన్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ శాఖలో సహాయ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావుకు
తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసిన ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో రామచంద్రపురం గ్రామపంచాయతీ సర్పంచ్ భూరెడ్డి స్వాతి సుబ్బారావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. విద్యుత్ శాఖలో ప్రజలకు అందిస్తున్న సేవలు, విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.సుబ్బారావు సాధించిన ఈ గౌరవం రామచంద్రపురం గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ భూరెడ్డి స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొని సుబ్బారావుకు అభినందనలు తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default