నవశకం. జూన్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ శాఖలో సహాయ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావుకు
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో రామచంద్రపురం గ్రామపంచాయతీ సర్పంచ్ భూరెడ్డి స్వాతి సుబ్బారావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. విద్యుత్ శాఖలో ప్రజలకు అందిస్తున్న సేవలు, విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.సుబ్బారావు సాధించిన ఈ గౌరవం రామచంద్రపురం గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ భూరెడ్డి స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొని సుబ్బారావుకు అభినందనలు తెలియజేశారు.