భద్రాచలం ఐటిడిఏ పివో రాహుల్ కు ఘన సత్కారం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0
నవశకం.జూన్ 5: 
వివరాలలోకి వెళ్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబర్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ స్థాయి "ఉత్తమ ప్రాజెక్టు అధికారి" అవార్డును అందుకున్న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును స్వీకరించి భద్రాచలం చేరుకున్న తరువాత, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ను, ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి అభినందించారు. శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ "గిరిజనుల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ఐటీడీఏ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకు గర్వకారణమన్నారు. గిరిజన సంస్కృతి పరిరక్షణ, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, మహిళా సాధికారత, రైతులకు మార్కెటింగ్ అవకాశాల కల్పన, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు వంటి కార్యక్రమాల్లో రాహుల్ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పీవో రాహుల్ మాట్లాడుతూ " ఈ అవార్డు తన ఒక్కరి కృషికి మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గిరిజన ప్రజల సహకారానికి దక్కిన గుర్తింపు అని అన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default